కెస్లాపూర్కు తరలివచ్చిన ఉర్వేత వంశీయులు
ఉత్సాహంగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఆదివాసులు
ఇంద్రవెల్లి, మే 26 : ఉమ్మడి జిల్లాలోని ఆది వాసీ గిరిజనులు తమ కుల దేవత పెర్సపేన్ (పెద్ద దేవుడు)కు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో ఉర్వేత వంశీయుల ఆధ్వర్యంలో బుధ వారం పెర్సపేన్ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలా లకు చెందిన ఉర్వేత వంశీయులు కెస్లాపూర్ గ్రామానికి తరలివచ్చారు. పెర్సపేన్కి సాంప్రదా యం ప్రకారం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పొలిమేరలోని చెట్టు వద్ద పూజల అనంతరం పెర్సపేన్ దేవతను గ్రామం చుట్టూ గిరిజన ఊరేగించారు. పవిత్ర స్నానానికి దేవతను వాయిద్యాల మధ్య తరలించారు. ఉర్వేత వంశీయుల పటేల్ రామరావ్ పటేల్, ఉర్వేత వంశీయుల కటోడ బండు, సహాయ కుడు షేకు, కెస్లాపూర్ గ్రామ పటేల్ మెస్రం వెంక ట్రావ్ పటేల్, ఆదివాసీ గిరిజన పెద్దలు బాధిరావ్ పటేల్, లింబా రావ్ పటేల్, మెస్రం వంశీయులు నాగ్నాథ్, తుకారాం, ఆనంద్రావ్, కోట్నాక్ బారిక్రావ్, తదితరులు పాల్గొన్నారు.
ఝరి గ్రామంలో..
నార్నూర్, మే 26 : గాదిగూడ మండలం ఝరి గ్రామంలో నాగ్బిడ్ మెస్రం వంశస్తుల ఆధ్వర్యంలో పెర్సాపేన్కు భక్తిశ్రద్ధలతో సంప్రదా య పూజలు నిర్వహించారు. వాయిద్యాల మధ్య గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. స్థానిక ఆది వాసులు సాంప్రదాయ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు కరోనా వైరస్ బారినప డకుండా కాపాడాలని వేడుకున్నట్లు కటోడా మెస్రం నాగో రావ్ తెలిపారు. మెస్రం అంబాజీ, మెస్రం లింగు, మెస్రం దాన్ను, సర్పంచ్ మెస్రం దేవ్రావ్, కొడప జాకు, మెస్రం సోము ఉన్నారు.