ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 25: హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో జిల్లా,మండల, గ్రామ స్థాయి నాయకులు భారీగా తరలివెళ్లారు. ఉదయం ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ హైటెక్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి వెళ్లిన వారిలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్,బాలూరి గోవర్ధన్ రెడ్డి, యూనుస్ అక్బానీ, నల్లా రాజేశ్వర్, అజయ్, అశ్రఫ్, గంగుల కిరణ్, జగదీష్, శివకుమార్ ఉన్నారు.
బోథ్, అక్టోబర్ 25: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు మండలం నుంచి పలువురు నాయకులు సోమవారం తరలి వెళ్లారు. హైదరాబాద్కు వెళ్లిన వారిలో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, బోథ్ పీఏసీఎస్ అధ్యక్షుడు కే ప్రశాంత్, పార్టీ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు గొడం జుగాదిరావు, మహిపాల్, సర్పంచ్లు జీ సురేందర్ యాదవ్, కొడప విజయ్, మారుపాక రమేశ్ ఉన్నారు.
తలమడుగు, అక్టోబర్ 25: టీఆర్ఎస్ ప్లీనరీకి పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గోక జీవన్రెడ్డి, నాయకులు మోట్టే కిరణ్ కూమర్, కజ్జర్ల ఉప సర్పంచ్ కాకెర్ల ప్రశాంత్ తదితరులు వెళ్లారు.
ఇచ్చోడ, అక్టోబర్ 25 : హైదరాబాద్లో నిర్వహించిన ప్లీనరీకి ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు.
గుడిహత్నూర్,అక్టోబరు 25: గుడిహత్నూర్ మండలం నుంచి పార్టీ ఉమ్మడి జిల్లా కోశాధికారి బూర్ల లక్ష్మీనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, ఏఎంసీ వైస్ చైర్మన్ జంగు, సర్పంచ్లు లింగంపెల్లి రాజేశ్వర్, జలందర్, ఉపసర్పంచ్ అరుగుల సంతోష్గౌడ్, అలీం వెళ్లారు.