కార్పొరేషన్, డిసెంబర్ 25: నగరంలోని మీసేవ కార్యాలయంలో శనివారం డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి-హరిశంకర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చిన్ననాటి మిత్రులు చల్ల దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాంనగర్లోని భవిత ఫౌండేషన్ వృద్ధ్దాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. డివిజన్ మీసేవ కార్యాలయంలో నగర మేయర్ సునీల్రావు చల్ల దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కార్పొరేటర్లు భారీ గజమాలతో సత్కరించారు. కేక్ కట్ చేశారు. పెటా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సన్మానించారు. 37వ డివిజన్ పారిశుధ్య కార్మికులు డిప్యూటీ మేయర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాంనగర్లోని శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి, అభయాంజనేయ దేవస్థాన కమిటీ చైర్మన్ చల్ల హరికృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుడు భహిరి, అనిల్కుమార్ డిప్యూటీ మేయర్కు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్లోని ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సం ఘం అధ్యక్షుడు నాంచారి రాజయ్య ఆధ్వర్యం లో సంఘ సభ్యులు, కుల బాంధవులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. గౌడ సంఘం, జీకే యూత్ ఆధ్వర్యంలో చల్ల స్వరూపారాణి, హరిశంకర్కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అలాగే నగరంలోని వివిధ సంఘాలు, యువజన సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కుల సంఘాల నాయకులు డిప్యూటీ మేయర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆశ్రమంలో అన్నదానం
కొత్లపల్లి, డిసెంబర్ 25: డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం హౌసింగ్బోర్డుకాలనీలోగల వీరబ్రహ్మేంద్రస్వామి అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. అనంతరం చల్ల హరిశంకర్ యువసేన అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద, సామాజిక సేవలో విస్తృత సేవలందిస్తున్న డిప్యూటీ మేయర్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువసేన నాయకులు పెంటి నవీన్, జక్కని సాయిరాం, బొమ్మకంటి ఆంజనేయులు, గాండ్ల రమేశ్, ముప్పిడి సునీల్, బొల్లం లింగమూర్తి, అఖిల తదితరులు పాల్గొన్నారు.