మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
తాండ్ర(జీ)లో ఆలయాలు ప్రారంభం
సారంగాపూర్, డిసెంబర్ 24 : దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఎన్నో సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో సంక్షే మ పథకాల పితామహుడిగా సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర అటవీ, పర్యావర ణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని తాండ్ర(జీ) గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన రాజరాజేశ్వర, రూ.10 లక్షలతో నిర్మించిన శివాలయ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు మంత్రికి వేదపండితులు పూర్ణకుంభం, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న పద్మశాలీ (మార్కండేయ) సంఘ భవనానికి భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దే వాలయాల్లో మానసిక ప్రశాంతత ఉంటుందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆలయాలకు పూ ర్వవైభవం సంతరించుకుందని, నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 90శాతం దేవాలయాలు అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. దోనిగాం ప్రాజెక్టుకు రూ.12 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు. స్వర్ణ ప్రాజెక్టు వాగు చుట్టూ చెక్డ్యామ్లు నిర్మించుకుంటున్నామని, పనులు శరవేగంగా సాగుతున్నట్లు చెప్పారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో రాతిశిలలతో అడెల్లి పోచమ్మ దేవాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన రవికాంత్, శ్రీధర్, నరేశ్ నేపాల్లో జరిగిన జాతీయస్థాయి వాలీబాల్, రన్నింగ్ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు సాధించారు. వీరిని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేశారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయి టి చందు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ మాణిక్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చెదలి మల్లయ్య, సర్పంచ్లు ఉమ, లస్మయ్య, రవీందర్రెడ్డి, నాయకులు రాజ్మహ్మద్, మధుకర్, కత్తెరపాక భూమేశ్, సూర్యం, సురేందర్, ఇస్మాయిల్, శేఖర్ పాల్గొన్నారు.
రైతులను రైస్మిల్లర్లు చైతన్యవంతం చేయాలి
నిర్మల్ టౌన్, డిసెంబర్ 24 : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అటు రైతులకు, ఇటు రైస్మిల్లర్లకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున నష్టపోకుండా రైతులను అధికారులు, రైస్మిల్లర్లు చైతన్యవంతం చేయాలని మంత్రి ఐకే రెడ్డి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో రైస్మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెబుతుండగా.. ఇక్కడి బీజేపీ నాయకులు వరి సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుల మాటలను నమ్మి వరి సాగు చేస్తే నష్టపోయేది రైతులేనని పేర్కొన్నారు. రైతులు స్వచ్ఛందంగా వరి సాగు చేసుకుంటే కొనుగోళ్ల బాధ్యత ప్రభుత్వానిది కాదని గుర్తు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సుధారాణి, డీఎం శ్రీకళ, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో రమేశ్రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.