ఎదులాపురం, నవంబర్ 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 36వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని డీఎల్ఎస్ఏ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత తెలిపారు. కక్షిదారులందరూ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డిసెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సుప్రీం, హైకోర్టుల ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు తమ కేనులను లోక్ అదాలత్లో పరిష్కరించు కోవచ్చని సూచించారు. ఇందులో భాగంగానే ఈ నెల 29 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ కేసులను పరిష్కరించుకునేందుకు వచ్చేనెల 11వ తేదీ చివరిదని పేర్కొన్నారు. ఇందులో సివిల్ కేసులతో పాటు ఇతర కేసులూ పరిష్కరించుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసులు పరిష్కరించుకుంటే కోర్డుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. సమావేశంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ఉన్నారు.