ముక్రా(కే)లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి
ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యవర్గం
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఇచ్చోడ, జనవరి 24: మండలంలోని ముక్రా(కే) గ్రామంలో మూడేళ్లలో రూ. 33 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ గాడ్గె మీనాక్షి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ముక్రా (కే) గ్రామంలో చేపట్టిన పనుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామస్తులు ఇక్కడే సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గతంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఆదర్శ గ్రామంగా మారిందన్నారు. ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ వర్షతాయి, పాలక వర్గ సభ్యులు తిరుపతి, సంజీవ్, ప్రహ్లాద్, మాధవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.