ఖానాపూర్ టౌన్, జనవరి 24: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మున్సిపాలిటీలోని 11వ వార్డు రాజీవ్నగర్లో మున్సిపల్ చైర్మన్ రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభానికి కలెక్టర్ ముషారప్ అలీ ఫారూఖీతో కలిసి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో ఖానాపూర్ పట్టణ నిరుపేద ప్రజల కోసం కుమ్రం భీం చౌరస్తాలో 400 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామన్నారు. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో అధికారుల పర్యవేక్షణలో అర్హులైన నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని ఎవరైనా ఇండ్లు ఇప్పిస్తామని మాయ మాటలు చెబితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్తో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. నీటి సౌకర్యం, సెప్టిక్ ట్యాంకు, ఎలక్ట్రిసిటీ సదుపాయలు లేవని పలువురు నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్లు రాజురా సత్యం, తొంటి శ్రీనివాస్, కావలి సంతోష్, మున్సిపల్ కమిషనర్ సంతోష్, తహసీల్దార్ లక్ష్మి, నాయకులు రాజగంగన్న, సురేశ్, రామునాయక్, కిశోర్, మహేశ్, శ్రీనివాస్, పలు శాఖల అధికారు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.