గుడిహత్నూర్, జనవరి 24 : మూగజీవాలు రోగాల బారిన పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలం సీతాగోంది గ్రామంలో గొర్రెలు, మేకలకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పీపీఆర్ టీకాల కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేలు జాతి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. రోజురోజుకూ పాల డిమాండ్ పెరుగుతుందన్నారు. సబ్సిడీపై గొర్రెలు, మేకలను అందజేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీఏ రంగారావ్, డాక్టర్ రాథోడ్ జీవన్, సర్పంచ్ మడావి ధనలక్ష్మి, ఎంపీటీసీ కృష్ణవేణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, నాయకులు సంతోష్గౌడ్, జంగు, ఆశన్న యాదవ్, పాటిల్ రాందాస్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
‘దళిత బంధు’ను విజయవంతం చేయాలి
బోథ్, జనవరి 24: దళిత బంధు పథకం విజయవంతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ కన్వీనర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకం ద్వారా మొదటి విడుతలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అర్హులను ఎంపిక చేయడానికి సహకరించాలని కోరారు. దళిత బస్తీ పథకం కింద రాష్ట్రంలోనే అత్యధికంగా బోథ్ నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు సుమారు 3 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. ఎంపీపీలు రాథోడ్ సజన్, రత్నప్రభ సంతోష్, మంజులా శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
బీటీ రోడ్ల అభివృద్ధికి రూ 5 కోట్లు..
బోథ్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల్లో ఎనిమిది బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బజార్హత్నూర్ మండలంలో జడ్పీ రోడ్డు నుంచి మాడగూడ వరకు రూ.75 లక్ష లు, గుడిహత్నూర్ మండలం జాతీయ రహదా రి నుంచి కమలాపూర్ వరకు రూ.15 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. నేరడిగొండ మం డలం జాతీయ రహదారి నుంచి రాజురా, ఈస్పూర్ రోడ్డుకు రూ.10 లక్షలు, పీఆర్ రోడ్డు నుం చి రాజుల్తండా వరకు రూ.50 లక్షలు, జాతీ య రహదారి నుంచి వడ్డూర్, బోందిడి రోడ్డుకు రూ.30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. తలమడుగు మండలం కప్పర్దేవి నుంచి ఉమ్రి ఇంద్రానగర్, దేహగాం రోడ్డుకు రూ.1.10 కోట్లు, బరంపూర్ నుంచి పూనాగూడ, ఝరి, కప్పర్దేవి రోడ్డుకు రూ.70 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. తాంసి మండలంలోని పొ చ్చెర జడ్పీ రోడ్డు నుంచి వడ్డాడీ రోడ్డుకు రూ.1.40 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.