ఎదులాపురం,అక్టోబర్ 23 : ఆదిలాబాద్ను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని ఇన్చార్జి ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర అన్నారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక పోలీసు బలగాలతో పది రోజుల్లో జిల్లా అంతటా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆకస్మికంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టాలని సూచించారు. గంజాయి విక్రేతలపై ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. ప్రతి మండల కేంద్రం లో ఎక్సైజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఏఎ స్పీ హర్షవర్ధ్దన్ శ్రీవాత్సవ్, అదనపు ఎస్పీ లు ఎస్. శ్రీనివాస్రావు, సమయ్ జాన్రావు, వి నోద్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎం.విజయ్కుమార్, సీఐలు పోతారం శ్రీనివా స్, ఎస్. రామకృష్ణ, గుమ్మడి మల్లేశ్, ఈ . చం ద్రమౌళి, కోంక మల్లేశ్, ఎం. నైలు, కే. ప్రే మ్ కుమార్, ఐ. సైదారావు, రమేశ్బాబు, డీ ఎసీఆర్బీ సీఐ జాదవ్ గుణవంత్రావు, స్పె షల్ బ్రాంచ్ ఎస్ఐ సయ్యద్ అన్వ ర్ ఉల్ హక్ , ఎ క్సైజ్ సీఐ శ్రీనివాస్, పురుషోత్తం పాల్గొన్నారు.
పట్టణ దిగ్బంధం..
ఎదులాపురం,అక్టోబర్23: ప్రత్యేక కమాండో పోలీసులు పట్టణంలోని ట్రేడర్స్ షాపులు, పాన్ షాపుల్లో శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రూ.5 లక్ష విలువైన గుట్కా, అం బర్ ప్యాకెట్లను స్వా ధీనం చేసుకొని 12 మం దిపై సంబంధిత పోలీ స్ స్టేషన్లలో కేసు నమో దు చేశారు. సీసీఎస్ పోలీసులు కేఆర్కే కాలనీలోని ఓ ఇంటిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక నివాసి గంజాయి విక్రే త సవాంకే అం బాదాస్ ఇంటిలో సోదాలు నిర్వహించి ఎనిమిది గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.