గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
జైనథ్, జనవరి 23 : గ్రామాల్లో 70 ఏండ్లలో జ రగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలో చేశామని, గ్రామాల్లో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని గూడ గ్రామంలో నూతనంగా నిర్మించి న గ్రామ పంచాయతీ భవనం, శ్మశానవాటిక ప్రారంభోత్సవా నికి ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గూడ గ్రామంలో రూ.5.43 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మార్చి బడ్జెట్లో డబుల్బెడ్రూం ఇండ్లు, 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల హామీలో లేని కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దళితబంధు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని చెప్పారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కం డ్లు కనబడడం లేదా? అని ప్రశ్నించారు. 20 ఏండ్ల పాటు సీఎం కేసీఆర్ అధికారం లో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాజీరావు బాబా పల్లకీ ఊరేగింపు
తరోడ గ్రామంలో బాజీరావు సప్తాహ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. పల్లకీ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ ధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో మహాన్నదానం నిర్వహించారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధ న్, వైస్ ఎంపీపీ విజ య్ కుమార్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఊశ న్న, సర్పంచ్ ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ఎంపీటీసీ తోట రమేశ్, నాయకులు గజానన్, ప్రవీణ్, అరవింద్, సర్పంచులు, నాయకులు, బాబా భక్తులు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధే ప్రధాన ధ్యేయం..
ఆదిలాబాద్ రూరల్, జనవరి 23 : ఆదిలాబాద్ పట్టణంలోని సమస్యలను తీర్చి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని చిలకూరి లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆయన ప్రారంభించారు. చిలకూరి లక్ష్మీ నగర్లో రూ.70 లక్షలతో బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. పట్టణంలోని 49 వార్డుల్లోనూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు సంద నర్సింగ్, గోలి శంకర్ పాల్గొన్నారు.
పర్ధాన్ సమాజ్ అభివృద్ధికి కృషి..
ఎదులాపురం, జనవరి 23 : పర్ధాన్ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఇంద్రానగర్లోని పర్ధాన్ సమాజ్ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ చిన్నారులు స్వాగతం పలికారు. ముందుగా హీరాసుకా విగ్రహానికి పూజలు చేశారు.అత్యంత వెనుకబడ్డ పర్ధాన్ సమాజ్ కులలస్తులు ఐక్యంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో పర్ధాన్ సమాజ్ కులస్తుల కోసం రూ.50 లక్షలతో జిల్లా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంటి స్థలంలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పర్ధాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు దుర్వ నగేశ్, డివిజన్ అధ్యక్షుడు గొడాం గంగారాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు యూనుస్ అక్బానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, నాయకులు గెడం జనార్దన్, దివ్య, రామేశ్వర్, గొడాం అనిల్,.రమేశ్, బలిరాం, కిశోర్ పాల్గొన్నారు.
.