త్వరలోనే టెండర్లు.ఆపై పనులు
సీఎం కేసీఆర్కు విప్ సుమన్ కృతజ్ఞతలు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలు
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/ ఆసిఫాబాద్ / మంచిర్యాల టౌన్, జనవరి 23 :టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా మండల కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న పల్లె రోడ్లకు నిధులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 11 గ్రామాల్లో 25.83 కిలో మీటర్లు రోడ్డు నిర్మించేందుకు రూ.7.79 కోట్లు మంజూరు చేసింది. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ రోడ్డు నుంచి బెల్గాం వరకు 2.15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.75.25 లక్షలు, ఆసిఫాబాద్లోని పీడబ్ల్యూ రోడ్డు నుంచి గోవిందపూర్ వరకు 2.30 కిలోమీటర్లకుగాను రూ.80.50 లక్షలు, ఆసిఫాబాద్లోని వీవీపీ రోడ్డు నుంచి ఎల్లారం వరకు 2.20 కిలోమీటర్లకు రూ. 77 లక్షలు, రెబ్బెన మండల కేం ద్రంలోని జడ్పీ రోడ్డు నుంచి ధర్మారం వరకు 4.20 కిలో మీటర్లకు రూ.66.25 లక్షలు, వాంకిడి మండల కేంద్రంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జంబుల్ధారీ మీదుగా చిన్నవాంకిడికి వరకు 2.60 కిలోమీటర్లకు రూ.91 లక్షలు, చింతలమానేపల్లి మండల కేంద్రంలోని రన్వెల్లి నుంచి రవీంద్రనగర్-1 వరకు 3.94 కిలో మీటర్లకు రూ. 124 లక్షలు, దహెగాం మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి పెసరకుంటకు వరకు 1.58 కిలో మీటర్లకు రూ. 52 లక్షలు, దహెగాం మండలం ఉడ్డుగూడ నుంచి కొంచవెళ్లి మీదుగా భామనగర్ వరకు 2 కిలో మీటర్లకు రూ. 69 లక్షలు, కాగజ్నగర్ మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి భామనిచేను వరకు 1.85 కిలో మీటర్లకు రూ. 39 లక్షలు, పెంచికల్పెట మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి పొతేపల్లి వరకు 1.51 కిలోమీటర్లకు రూ. 53 లక్షలు, సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కొమ్ముగూడ వరకు 1.50 కిలో మీటర్లకు రూ. 52 లక్షలు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలవనుండగా, ఆపై పనులను ప్రారంభించేందుకు అధికార యంత్రాం గం చర్యలు తీసుకుంటుంది. కాగా, రెండేళ్లుగా కరోనా విజృంభిస్తున్నా సంక్షేమం, అభివృద్ధి విషయంలో సర్కారు ఎక్కడా రాజీ పడడం లేదు.
చెన్నూర్ నియోజకవర్గంలో..
చెన్నూర్ నియోజకవర్గంలోని 9 రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్ర భుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసింది. భీమారం మండలం ఎన్హెచ్ 63 భీమారం నుంచి మద్దికల్ మీదుగా కొత్త పల్లి వరకు బీటీ రోడ్ల మరమ్మతుకు రూ.2.5 కోట్లు మంజూరయ్యాయి. భీమారం మండలం పంచాయతీ రాజ్ శాఖ (పీడబ్ల్యూడీ) రోడ్ నుంచి దాంపూర్ మీదుగా ధర్మారం వరకు బీటీ రోడ్డు మ రమ్మతుకు రూ.40 లక్షలు మంజూరు చేసింది. చెన్నూర్ మండలం కత్తెరశాల నుంచి నారాయణపూర్ మీదుగా వెంకంపేట్ వరకు రూ.70 లక్షలతో బీటీ రోడ్డు, కిష్టంపేట నుంచి సుద్దాల మీదుగా గంగారం వరకు రూ.25 లక్షలు బీటీ రోడ్డు మరమ్మతుకు మంజూ రు చేసింది. జైపూర్ మండలం పీడబ్ల్యూడీ రోడ్ నుంచి మద్దులపల్లి వరకు రూ.28 లక్షలతో బీటీ రోడ్డు, జైపూర్ మండలంలో ఎన్ హెచ్-63 నుంచి దుబ్బపల్లి మీదుగా వెంకట్రావుపల్లి వరకు రూ.44 లక్షలతో బీటీ రెన్యూవల్ చేసింది. మందమర్రి మం డలంలో స్టేట్ హైవే రోడ్డు నుంచి బొక్కల గుట్ట మీదుగా ఏసీసీ రోడ్ వరకు రూ.75 లక్షలతో బీటీ రోడ్డు, మందమర్రి మం డలంలో ఐఎంవీఆర్ రోడ్డు సారంగపల్లి నుంచి చిర్రకుంట వరకు రూ.66 లక్షలతో బీటీ రోడ్డు రెన్యూవల్ చేసింది. రోడ్ల మర మ్మతులకు రూ.6 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ప్రభుత్వవిప్ బాల్క సుమన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల నియోజకవర్గంలో..
మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ. 5.51 కోట్లు పంచాయతీరా జ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా మంజూరైనట్లు ఎమ్మెల్యే దివాకర్రావు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో 33.76 కిలోమీటర్ల పరిధిలో 15 రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయని, ఈ నిధులతో రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్ నుంచి తానిమడుగు వరకు 3.28 కిలోమీటర్లు, పీడబ్ల్యూడీ రోడ్నుంచి గుడిరేవు వరకు రెండు కిలోమీటర్లు, పీడబ్ల్యూడీ రోడ్నుంచి మామిడిపల్లి వరకు 1.60 కిలోమీటర్లు, పీడబ్ల్యూడీ రోడ్నుంచి కన్నెపల్లి వరకు 1.60 కిలోమీటర్లు, ధర్మారావుపేట నుంచి మోకాసిగూడ మీదుగా పెద్దపేట, లక్ష్మీకాంతాపూర్, బిక్కన్గూడ, కాసిపల్లి, అల్లీపూర్ వరకు 1.50 కిలోమీటర్లు, పీడబ్ల్యూడీ రోడ్నుంచి నర్సాపూర్, ద్వారక ఎక్స్రోడ్ వరకు 2.53 కిలోమీటర్లు, ముత్యంపేట చెక్పోస్ట్ నుంచి రెబ్బెనపల్లి వరకు అరకిలోమీటరు మేర మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడిం చారు. హాజీపూర్ మండలంలో నమ్నూర్ ఎక్స్రోడ్ నుంచి పీడబ్ల్యూడీ రోడ్ వరకు, పీడబ్ల్యూడీ రోడ్నుంచి రాంపూర్ వరకు, హాజీపూర్ నుంచి పాత పడ్తన్పల్లి వరకు, ఎన్హెచ్ రోడ్నుంచి కొలాంగూడ వరకు, లక్షెటిపేట మండలంలో ఎన్హెచ్ రోడ్నుంచి మిట్టపల్లి వరకు, లక్ష్మీపూర్ నుంచి రంగం పేట వరకు, ఎన్హెచ్ 63 నుంచి లక్ష్మీపూర్ వరకు, ఎన్హెచ్ 63 ఇటిక్యాల నుంచి పెద్దంపేట వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.