వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధన
అందుకనుగుణంగా సకల సౌకర్యాలు
గోడలపై ఆకట్టుకునేలా జంతువులు, పక్షుల బొమ్మలు, పదాలు
ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/ కెరమెరి : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొ త్తం 908 ప్రాథమిక, 180 ప్రాథమికోన్నత, 170 జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 33 వేల మం ది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే 19 పాఠశాలల్లో ఆంగ్ల బోధన సాగుతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభం కానుండగా, అధికారులు అందుకు అనుగుణంగా వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ‘మనఊరు మన బడి’ కార్యక్రమంలో భాగం గా సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. డిజిటల్ తరగతులు అందుబాటులోకి తేవడంతో పాటు విద్యుద్దీకరణ, ఫర్నిచర్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థి తరగతి గదిలో కి రాగానే కొత్తపాఠశాలలోకి వచ్చినట్లు అనుభూతి పొందే విధంగా అలంకరిస్తున్నారు. గోడలపై ఆంగ్ల పదాలు రాయడంతోపాటు ఆకట్టుకునేలా జంతువు, పక్షుల బొమ్మలు వేస్తున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి పదో తరగతి వర కు ఆంగ్ల బోధన అమలు కానుండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పైస ఖర్చులేకుండా ఇంగ్లిష్ మీడియం
నా బిడ్డ భావన ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువు తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు న్నోళ్ల పిల్లల లెక్క పేదోళ్ల బిడ్డలకూ మంచి చదువు అందిస్తున్నది. ఇక నుంచి అన్నిచోట్ల ఇంగ్లిష్ మీడియం పెడుతరట. ఇప్పటికీ ఇంగ్లిష్ మీడియం కోసం కొందరు వేరే ఊర్లకు పిల్లలను పంపిస్తున్నరు. కొందరు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నరు. అప్పులు చేసి ఫీజులు కడుతున్నరు. ఇగ మాలాంటి పేదోళ్లకు రంది లేకుంటైతంది. పైసా ఖర్చులే కుండా సర్కారు బడిలో ఇంగ్లిష్ మీడియం చదివించవచ్చు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం. – కుడిమేత యాదవ్రావ్, గోండ్ ఝరి, కెరమెరి
ఇది మంచి ఆలోచన
నా కుమారుడు లచ్చు గోండ్ఝరిలోని యూపీపీఎస్లో ఆరో తరగతి చదువుతున్నా డు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత లేక ప్రభుత్వ బడిలో తెలుగు మీడియంలో చేర్పించిన. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారోళ్లు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెడుతమని చెబుతున్నరు. ఇది మంచి ఆలోచన. ఇగ పేద పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవచ్చు.