మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్లో ట్రీ అంబులెన్స్,కలెక్టరేట్లో ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభం
నిర్మల్ టౌన్, డిసెంబర్ 22: మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మొక్కల పెంపకానికి నూతనంగా ఏర్పాటు చేసిన ట్రీ అంబులెన్స్ను నిర్మల్ కలెక్టరేట్ ఎదుట మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 23 శాతం ఉన్న అడవులను 33శాతానికి పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తున్నట్లు చెప్పారు. మొక్కల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మల్లో ట్రీ అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో నాటిన మొక్కల్లో పాడైపోయిన వాటిని గుర్తించి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు ఈ అంబులెన్స్ ఉపయోగపడుతుందన్నారు.
ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభం
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రయోజనాలను వీక్షించేలా రాష్ట్రంలోనే మొదటి సారిగా నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని మంత్రి అల్లోల అన్నారు. కలెక్టరేట్లోఎల్ఈడీ డిస్ప్లేను బుధవారం ప్రారంభించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్మల్ జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలను ఈ స్క్రీన్పై ప్రదర్శించనున్నట్లు వివరించారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
నిర్మల్ ఆర్భన్, డిసెంబర్ 22: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. న్మిల్లోని రాజరాజేశ్వర గార్డెన్లో క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వెల్లడించారు. జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో కే విజయలక్ష్మి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, సీ రాంబాబు, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యంరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్సీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీఆర్వో ఉషారాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ అధికారి స్రవంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఏపీడీ ఓస శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మెరుగు సత్యనారాయణ, గుడిసె సత్యనారాయణ, నాయకులు కృష్ణంరాజు, ఎడ్పెల్లి నరేందర్, తహసీల్దార్లు ఖాదీర్, ప్రభాకర్, పాస్టర్లు చంద్రశేఖర్, స్వామిదాస్, రాజ్కుమార్, రత్నం, సునీల్, విజయ్ ఉన్నారు.
కాల్వలో సబ్స్టేషన్ ప్రారంభం
దిలావర్పూర్, డిసెంబర్ 22 : మండలంలోని కాల్వ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్స్టేషన్ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన మత్స్యకారుల సంఘం భవనాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అడెపు తిరుమల, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ బాబురావ్, ట్రాన్స్కో ఎస్సీ చౌహాన్, దేవేందర్రెడ్డి, బన్సపల్లి పీఏసీఎస్ చైర్మన్ పీవీ రమణా రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ చిన్నయ్య, శ్రీనివాస్, మాజీ ఆలయ చైర్మన్ ఇప్ప నర్సారెడ్డి, సర్పంచ్లు గంగారెడ్డి, ఎంపీటీసీలు పాల్దే అక్షర అనిల్, ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్, ఎంపీడీవో మోహన్, తహసీల్దార్ హిమబిందు, ఎంపీవో అజీజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు ఉన్నారు.
మొండిగుట్టలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ
మామడ,డిసెంబర్22 : మండలంలోని మొండిగుట్టలో రూ.10లక్షలతో నిర్మించిన హనుమాన్ ఆలయంలో బుధవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. కైలాస్ టేకిడి లింబాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కిచ్యానాయక్, ఎంపీటీసీ జాదవ్ చరణ్య జాలం, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు రాందాస్, జైసింగ్, కైలాస్, సంతోష్, రఘ, జగదాంబదేవి ఆలయ పూజారి ప్రేంసింగ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.