బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ
బజార్హత్నూర్, డిసెంబర్ 22 : అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే బాపురావ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలతో ఈ భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అంతకుముందు మండలంలోని గిర్నూర్, దేగామ, మోర్కండి, చందునాయక్తండా, మంజారంతండా, బోస్రా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, వైస్ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం మండలాధ్యక్షుడు రాజేశ్వర్, మండల కన్వీనర్ రాజారాం, నాయకులు నరేశ్, భాస్కర్రెడ్డి, విద్యాసాగర్, కైలాస్, అక్షయ్, సాయన్న, విలాస్, తదితరులు పాల్గొన్నారు.
సిరిచెల్మ గ్రామ అభివృద్ధికి కృషి
ఇచ్చోడ, డిసెంబర్ 22 : మండలంలోని సిరిచెల్మ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. సిరిచెల్మ సర్పంచ్ గుండాల లక్ష్మి భర్త కన్నమయ్య, టీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి వివరించారు. మూడు రోజుల్లో గ్రామంలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ టీఆర్ఎస్ మండల కన్వీ నర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్ ఉన్నారు.
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
బోథ్, డిసెంబర్ 22: పేదల అండగా సీఎంఆర్ఎఫ్ ఉంటుందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బోథ్, ఇచ్చోడ మండలాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.40 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్ సలాం, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్సింగ్, సర్పంచ్ సురేందర్యాదవ్, నాయకులు భోజన్న, ఎన్ జగన్మోహన్రెడ్డి, సుభాష్, ఎలుక రాజు, అల్లకొండ ప్రశాంత్, బుచ్చయ్య, రమేశ్, డీ నారాయణరెడ్డి, చాట్ల ఉమేశ్, ఎం ప్రవీణ్, ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, డిసెంబర్ 22 : గుడిహత్నూర్కు చెందిన ముండె మాధవ్కు రూ.20వేలు, కొల్హారి గ్రామానికి చెందిన ఫడ్ సుభాష్కు రూ.26వేలు, వాగ్మారే మాధవ్కు రూ.18వేలు, మన్నూర్ గ్రామానికి చెందిన కాలే మురళికి రూ.60వేలు, సీతాబాయికి రూ.20వేలు. ముండె సరస్వతికి రూ.10వేలు, సీతాగోంది గ్రామానికి చెందిన పాటిల్ తానుబాయికి రూ.44వేలు, శాంతాపూర్ గ్రామానికి చెందిన లగడ్ హరిపాల్కు రూ. 60వేలు, తోషం గ్రామానికి చెందిన రవీందర్కు రూ.60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు న్యాను, శగీర్ఖాన్, సర్పంచ్ భీంరావ్, ఏఎంసీ వైస్ చైర్మన్ జంగు, నాయకులు సంతోష్గౌడ్, కొల్లూరి వినోద్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాల బలోపేతానికి కృషి
తలమడుగు, డిసెంబర్ 22: నియోజకవర్గంలో సహకార సంఘాల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని సుంకిడి గ్రామంలో తలమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఫార్మర్ అగ్రిమార్ట్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, సర్పంచ్ మహేందర్ యాదవ్, ఎంపీటీసీ గౌరమ్మ, ఝరి పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, పీఏసీఎస్ సీఈవో మోతే శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్, మగ్గిడి ప్రకాశ్, కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, పొచ్చన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.