పభుత్వ విప్ బాల్క సుమన్
మందమర్రి, క్యాతనపల్లిలో పర్యటన
పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలను శరవేగంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఈ రెండు మున్సిపాలిటీల్లో పర్యటించారు.
రామకృష్ణాపూర్, డిసెంబర్ 22: క్యాతనపల్లి మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందే మున్సిపాలిటీ అని చెన్నూర్ శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన జరిగిన క్యాతనపల్లి మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మున్సిపాలిటీ జిల్లా కేంద్రానికి సమీపంలో మంచిర్యాల పట్టణానికి ఆనుకొని ఉన్నదని తెలిపారు. మున్సిపాలిటీకి సమీపంలోనే అద్భుతమైన గాంధారి వనం ఉన్నదని, ప్రజలు దీని సమీపంలో ఇండ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మున్సిపాలిటీ ఇప్పటికే 27.50 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జిపనులు కొనసాగుతున్నాయని, 3.60 కోట్ల నిధులతో విద్యుత్ లైన్లు మార్పు పనులు చేస్తే బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తవుతుందన్నారు. రూ.15 కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుంచి గాంధారి వనం వరకు నాలుగు లైన్ల రోడ్డు (ఆర్అండ్బీ) అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గాంధారి వనంలోని 25 ఎకరాల స్థలంలో అద్భుత శిల్పారామం సుమారు రూ.30 కోట్లతో అద్భుత శిల్పారామం నిర్మాణానికి డీపీఆర్ తయారు చేశామని తెలిపారు. రూ.2 కోట్లతో బొక్కలగుట్ట పాలవాగు బ్రిడ్జి నుంచి గాంధారి ఖిల్లా వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. పట్టణంలోని రూ.3 లక్షల నిధులతో మత్స్య పారిశ్రామిక సంఘం భవనం ప్రహరీకి భూమిపూజ చేశారు. అమరవాది చెరువు సమీపంలో రూ.5 లక్షల నిధులతో దోబీ ఘాట్కు, ఐదేసి లక్షల చొప్పున నాయీ బ్రాహ్మణ సంఘం భవనం, రజక సంఘం భవన నిర్మాణం, ఆటో యూనియన్ భవనం, తాపీ కార్మికుల సంఘం భవనం, యాదవ సంఘం భవనం, వడ్రంగి సంఘం భవనాల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి భూమిపూజలు నిర్వహించారు. అనంతరం ఆర్కే సీఓఏ క్లబ్ సమీపంలో 3 ఎకరాల స్థలంలో 7.20 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శిలాఫకంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, కమిషనర్ జీ వెంకటనారాయణ, మేనేజర్ నాగరాజు, ఏఈ అచ్యుత్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు సుదర్శన్గౌడ్, యాకూబ్అలీ, తహసీల్దార్ రాజలింగు, ఎలక్ట్రికల్ ఏఈ జయకృష్ణ, టీఆర్ఎస్ పట్టణ సమన్వయ కర్తలు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, బోయినపల్లి నర్సింగరావు, ఎర్రబెల్లి రాజేశ్, ఎల్లబెల్లి మూర్తి, జే. కుమార్, గడ్డం రాజు, కొక్కుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తా
మందమర్రి డిసెంబర్ 22: మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తానని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో 3.30 కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులతో పాటు రెండు కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్న వైకుంఠ ధామం, 2.78 కోట్లతో నిర్మించే జంతు వధశాల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. సింగరేణి సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అన్ని అభివృద్ది పనులను ఆనతి కాలంలోనే పర్తి చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ది పై అవగాహన లేని వివిధ పార్టీల నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పకొట్టాలని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజలింగం, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, జడ్పీటీసీ సభ్యుడు వేల్పుల రవి, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు జే.రవీందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, నాయకులు పాల్గొన్నారు.