ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
ఉపాధ్యాయులు, విద్యార్థుల నివాళి
ఆసిఫాబాద్, డిసెంబర్ 22 : శ్రీనివాస రామానుజన్ జ యంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని బు ధవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గురుకులంలో..
రెబ్బెన, డిసెంబర్ 22: రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాసరామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. విద్యార్థులు తయారు చేసిన గణిత ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ కాకులి సర్దార్, గణిత ఉపాధ్యాయుడు అశోక్, సౌజన్య, శరణ్య పాల్గొన్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో..
రెబ్బెన, డిసెంబర్ 22 : రెబ్బెనలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాసరామానుజన్ జయంతి నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎంఏ జాకీర్ఉస్మానీ, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాసరామానుజన్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హెచ్ఎం దోడ్డిపట్ల రవికుమార్ గణితం ప్రాముఖ్యతపై వివరించారు.
కాగజ్నగర్ పట్టణంలో..
కాగజ్నగర్టౌన్, డిసెంబర్ 22 : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్ఆర్వో కాలనీలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలతో పాటు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గణితశాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణిత శాస్త్ర ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సింహం, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, అధ్యాపకులు కావ్య, జనార్దన్, దత్తాత్రేయ, శ్రీనివాస్, సునీల్కుమార్, ప్రభుత్వ నూతన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవాజీ, ఉపాధ్యాయులు పర్శ చంద్రశేఖర్, సాగర్, శ్యామ్రావు, వేణు, జంగు పాల్గొన్నారు.
గణిత అధ్యాపకుడికి సన్మానం..
బెజ్జూర్, డిసెంబర్ 22 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. గణిత అధ్యాపకుడు నాగరాజు లెక్కల్లోని ట్రిక్స్ను విద్యార్థులకు వివరించారు. గణిత అధ్యాపకుడు నాగరాజును కళాశాల అధ్యాపకులు శాలువాతో సన్మానించారు.
దహెగాంలో..
దహెగాం,డిసెంబర్ 22 : మండలంలోని వివిధ పాఠశాలల్లో బుధవారం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన వేడుకల్లో ఇన్చార్జి మండల విద్యాధికారి భిక్షపతి పాల్గొన్నారు. గణితశాస్త్రం, దాని ప్రాముఖ్యత, శ్రీనివాస రామానుజన్ గురించి విద్యార్థులకు వివరించారు. కస్తూర్బా ఎస్వో రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.