మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
దండేపల్లి, డిసెంబర్22: పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందులో భాగంగానే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. బుధవారం దండేపల్లి తహసీల్ కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన యువతులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు సమితి కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, తహసీల్దార్ హన్మంతరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకశ్, సర్పంచులు విఠల్, డంకా లక్ష్మణ్, జాడి తిరుపతి, శాంతయ్య, ఎంపీటీసీలు ముత్తె రాజన్న, చుంచు మల్లవ్వ, ఉపసర్పంచ్లు గొట్ల భూమన్న, నలిమెల మహేశ్, సిద్ధి ప్రతాప్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, డిసెంబర్ 22 : కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత-శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి-రవి, రాపల్లి సర్పంచ్ ఆనె మల్లేశ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు నయిం పాషా, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, తహసీల్దార్ వాసంతి, ఆర్ఐ, తదితరులు పాల్గొన్నారు.