కుభీర్, డిసెంబర్ 22 : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. ముథోల్ లోని క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.6లక్షల విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యవసర సమయాల్లో పేదలు కార్పొరేట్ దవాఖానలలో చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసాయం పొందిన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు న్యాలపట్ల దత్తుగౌడ్, సర్పంచ్లు దత్తురాం పటేల్, విఠాపూర్ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గాడేకర్ రమేశ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సింగిల్విండో చైర్మన్ గంగాచరణ్, నాయకులు పీ విజయ్కుమార్, సిద్దంవార్ శ్రావణ్, సూది రాజన్న, బొప్ప నాగలింగం, తుకారాం, గంగయ్య, మిలింద్ పాల్గొన్నారు.
తాంసి, డిసెంబర్ 22: ఆరోగ్య శ్రీ వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బండలనాగాపూర్, కప్పర్ల, గిరిగాంకు చెందిన పలువురికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధ వారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమం లో ఎంపీపీ సురుకుంటి మంజుల,శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, సర్పంచ్లు గంగుల వెంకన్న, సదానందం, గజానన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, నాయకులు ఉత్తం, గంగారాం, ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.