హాజీపూర్, డిసెంబర్ 22 : ఓటరు జాబితా సంక్షిప్త సవరణ-2022లో భాగంగా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వార జిల్లా కలెక్టర్తో ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులందరూ ఓటు నమోదు చేసుకునే విధంగా సంబంధిత శాఖల అధికారులు విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల జాబితాను గరుడ యాప్లో నమోదు చేయాలన్నారు. 5 జనవరి 2022 నాటికి అన్ని గ్రామాలలో ఓట రు తుది జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఈవీఎం లను నూతన గోదాములకు తరలించడంతో పాటు ప్రతి నెలా తనిఖీ నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 22: మంచిర్యాల జిల్లాలో అదనపు ఈవీఎం గోదాముల నిర్మాణం కోసం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ నస్పూర్లో స్థలాన్ని పరిశీలించారు. బుధవారం నూతన కలెక్టరేట్ భవనం సమీపంలో అదనపు ఈవీఎం గోదాములు నిర్మించనున్నారు. ఇందు కోసం ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాలను ఆయన పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు నివేదిస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్అండ్బీ భవనాల శాఖ ఈఈ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.