రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, జూన్ 22: తెలంగాణ హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శమని రాష్ట్ర అ టవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో మంగళవారం హరితహారం, పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులు, ప్ర జాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించ గా, ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఆరు విడుతలుగా చేపట్టిన హరితహారం విజయవంత మైందని, ఏడో విడుతకు ప్రభుత్వం సన్నద్ధమైం దన్నారు. అడవుల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య జీవన విధానంలో మార్పు వస్తుందని స్పష్టం చేశారు. జులై 1 నుంచి పట్టణా ల్లో, పల్లెల్లో నిర్వహించే తెలంగాణకు హరితహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బా ధ్యతను తీసుకోవాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతికి ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నదని, వీటితో పల్లెల్లో వివిధ అభివృద్ధి కా ర్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల హక్కులను పాటిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే తొలగించే విషయం చట్టం పరిధిలో ఉందని గుర్తు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతితో పట ణ స్వరూపమే మారిపోయిందని తెలిపారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లా డుతూ స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలకు విశేషమైన అధికారాలను, బాధ్యతలను ఇవ్వడమే కాకుండా అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ను కూడా ప్రతినెలా ప్రభుత్వం విడుదల చేస్తున్నదని తెలిపారు.
ఉన్న నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ హరితహారం పట్టణ, పల్లె ప్రగతిపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే గతేడాది రా ష్ట్రంలోనే నిర్మల్కు సముచితస్థానం లభించిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా మెచ్చుకున్నారని తెలిపారు. ఈ విడుతలో లక్ష్యం కంటే పది శాతం అధిక మొక్కలు నాటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి కానుకగా ఇద్దామని ప్రకటించా రు. అనంతరం జిల్లాలో టీం వర్క్గా పని చేసి ఉ త్తమ ఫలితాలు సాధించిన ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, అంకం రాజేందర్, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రఫీ, డీఆర్డీవో వెంకటేశ్వ ర్లు, డీపీవో వెంకటేశ్వర్రావు, ఎంపీపీలు రామేశ్వర్రెడ్డి, మహిపాల్రెడ్డి, అప్క గజేందర్యాదవ్, జడ్పీటీసీలు జానాబాయి, పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, జీవన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు సముచిత గౌరవం
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభు త్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కా కుండా అధికారులు సముచిత గౌరవం కల్పించిం దని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్లకు కొత్త వాహనాలను ఇటీవల పంపిణీ చేయడంతో జిల్లా కేంద్రంలో మంగళవా రం పూజలు నిర్వహించి, మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్రెడ్డి, పత్తిరెడ్డి రా జేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యువత గమ్యాన్ని చేరుకోవాలి
నిర్మల్ అర్బన్, జూన్ 22: యువత నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మంత్రి అల్లోల ఇం ద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని మం త్రి క్యాంపు కార్యాలయంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 45 రోజుల్లో దాదాపు 11,500 కిలో మీటర్లు పలువురు యువకులు చేపట్టిన బైక్ యా త్రను జెండా ఊపి మంగళవారం ప్రారంభించా రు. సాయి, వినయ్(నిర్మల్), శ్రీను(భద్రాచలం), సీ నాయుడు(మచిలీపట్నం), గణేశ్, ప్రసాద్( రా జమండ్రి) ప్రపంచరికార్డు కోసం ఈ యాత్ర చేప ట్టడం అభినందనీయమన్నారు. వీరిని శాలువాతో ఘనంగా సన్మానించి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, దేవరకోట ఆల య మాజీ చైర్మన్ ఆమెడ కిషన్, అధ్యక్షుడు లిం గంపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు ఎడిపెల్లి నరేందర్, పూదరి రాజేశ్వర్ తదితరులున్నారు. నెలరోజులుగా నడుమునొప్పితో బాధపడుతున్న
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ను ప్రియదర్శినినగర్లోని ఆయన ఇంటికి వెళ్లి మంత్రి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.