రైల్వే, అండర్ వంతెనలకు నిధులు
ఎన్నికలకు ముందే నిర్మాణాలు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జనవరి 22: రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.97కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం ఆనందంగా ఉంద ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నెహ్రూచౌక్ వరకు శనివారం కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాంసి బస్టాండ్ వద్ద ఉన్న టపాసులు పేల్చి సంబురాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. వచ్చే రెండేళ్లలోపు తాంసి బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జిలు రెండు సైడులు, స్పిన్నింగ్ మిల్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలనుపూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకితెస్తామన్నారు. కేంద్రమే మొత్తం నిర్మాణాలు చేయాల్సి ఉండగా, బీజేపీ చేతులెత్తయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మాణాలకు రూ.57కోట్లు కేటాయించి నిధులు మంజూరు చేసిందన్నారు.రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి మాత్రమే కేంద్ర ం నిధులిచ్చిందన్నారు. ఉద్యోగులకు ఏడాదికి రూ.125కోట్లు ఖర్చవుతాయని వీటిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. 2023 డిసెంబర్ ఎన్నికల కంటే ముందే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్యార్డు వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం..
ఆదిలాబాద్ పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని భాగ్యనగర్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ పట్టణంలోని 49వార్డుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.