కలెక్టర్ సిక్తాపట్నాయక్
ఎదులాపురం, జనవరి 22: షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సం బంధించిన అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొవిడ్ సందర్భంగా సకాలంలో సమావేశాలు నిర్వహించలేకపోయామని, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు ఏ సమయంలో అధికారులు దృష్టికి తీసుకురావచ్చన్నారు. అధికారుల నుంచి సంపూర్ణ సహకారం అందిచాలన్నారు. రెవెన్యూ , పోలీస్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని సూ చించారు. 2020 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 25 కేసులు నమోదు కాగా, 5 కేసులు ఫైనల్ రిపోర్ట్ వచ్చిందన్నా రు. 2021 సంవత్సరంలో 33 కేసులు నమోదు కాగా, 3 కే సుల నివేదికలు అందాయని, 23 కేసులు ట్రయల్లో ఉన్నాయని 7 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉన్న కేసుల్లో సుమారు 80 నుంచి 90 శాతం వరకు చార్జిషీట్ దాఖలు చేశామన్నారు. దళితులకు సహకారం అందిస్తామని చెప్పారు. ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు ఎన్. నటరాజ్, రిజ్వాన్ భాషా షేక్ , జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, అధికారులు , సభ్యులు కాంబ్లే బాబా సా హెబ్, ఎల్ రోష్ణ, గెడం సుమన్ బాయి, ఎం.అనిల్ , మెస్రం భీంరావు, న్యాయవాదులు తదతరులు పాల్గొన్నారు.
భూములను కేటాయిస్తాం..
దళితుల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు అవసరమైన భూములు కేటాయించాలని, కృషియల్ సంక్షేమ నిధులు సకాలంలో వినియోగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అ న్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కృషి యల్ సంక్షేమ నిధిపై సంబంధిత శాఖల అధికారులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. వివిధ పనులకు సుమారు రూ. 29.98కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చామని, సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.