ఇంద్రవెల్లి, అక్టోబర్ 21: గ్రామాల్లో ప్రభుత్వ శాఖల పరంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జాతీయస్థాయి పర్యవేక్షణ తనిఖీ బృందం సభ్యులు ముత్తుకుమార్, దేవన్ గురువారం పరిశీలించారు. మండలంలోని కెస్లాపూర్, గౌరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈజీఎస్, వాటర్షెడ్, పంచాయతీరాజ్, ఐకేపీతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పలు రకాల అభివృద్ధి పనులపై ఆరాతీశారు. ప్రతి శాఖకు చెందిన ఐదు రకాల అభివృద్ధి పనులు ఎంపిక చేసి వాటిని పరిశీలించి నాణ్యతపై ఆరాతీశారు. తనిఖీ నివేదికలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణారావు, ఎంపీడీవో పుష్పలత, సర్పంచ్లు మెస్రం రేణుకానాగ్నాథ్, కోవ ఫాతిమాబాయి, ఎంపీవో సంతోష్, ఏపీవో సంతోష్ జైస్వాల్, ఈసీ జాదవ్ శ్రీనివాస్, ఏపీఎం రాథోడ్ రామారావ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు, నాయకులు మెస్రం నాగ్నాథ్, యాకుబ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
రాంపూర్లో కేంద్ర బృందం పర్యటన
సిరికొండ,అక్టోబర్ 21: రాంపూర్ (బీ)లో కేంద్ర బృందం సభ్యులు గురువారం పర్యటించారు. ఆదర్శ సంసద్ యోజన కింద ఎంపికైన ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను బృందం సభ్యులు ముత్తుకుమార్, దేవన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సభలో గ్రామంలో అమలువుతున్న అభివృద్ధి పనుల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు, పింఛన్లు, మహిళా సంఘాల పని తీరు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, పంచాయతీ రాజ్, హరితహారం, నర్సరీ, రైతు కల్లాల పురోగతిపై సమీక్షించారు కార్యక్రమంలో ఎంపీడీవో సురేశ్, సర్పంచ్ రేణుకాబాయి, కార్యదర్శి నాగభూషణ్, టీఏ ధన్రాజ్, ఐకేపీ కార్యకర్త రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.