బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ
నేరడిగొండ, జనవరి 21 : టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ బీమా పథకం అండగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని వాగ్దారి గ్రామంలో జాదవ్ సుదర్శన్, దర్బతండాలో రాథోడ్ దేవేందర్ కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున బీమా చెక్కులను శుక్రవారం ఎమ్మె ల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్తకు ప్రమాద బీమా ద్వారా వారి కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా నిలస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, బోథ్ ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, పార్టీ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, నాయకులు చంద్రశేఖర్యాదవ్, గాదె శంకర్, శ్రీనివాస్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజనులకేం చేశారని బీజీపీకి ఓట్లేస్తారు
బోథ్, జనవరి 21 : ఆదివాసీ గిరిజనులకు బీజేపీ ఏం మేలు చేసిందని ఓట్లు వేస్తారని ఆ పార్టీ నాయకులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నదని ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలకు 60 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాంటిది రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధిస్తున్నా తామే ఇస్తున్నామనడం వారి అవగాహనా లోపానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలిస్తే ఇకముందు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బోథ్ జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ డీ భోజన్న, ఐటీడీఏ డైరెక్టర్ మేస్రం భూమన్న, కన్వీనర్ ఎస్ రుక్మాన్సింగ్, ఆర్ఎస్ఎస్ మండలాధ్యక్షుడు ఎన్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ జీ సురేందర్యాదవ్, డీ నారాయణరెడ్డి, సోలంకి సత్యనారాయణ, చట్ల ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొమ్మిది మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మందబొగుడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రాము రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆయనకు మంజూరైన రూ.2 లోల చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. దండారీ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీ గూడేలకు మంజూరైన రూ.30 వేల విలువైన మూడు చెక్కులను ఆయా గ్రామాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, వెంకటరమణాగౌడ్, అల్లకొండ ప్రశాంత్, ఎలుక రాజు, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.