ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి
తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ
భీంపూర్, జనవరి 21 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో సత్ఫలితాలు ఉంటాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. తాంసి పోలీస్ స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలం మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉందని, కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అనంతరం పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పురుషోత్తమాచారి, ఎస్ఐ ధనశ్రీ, సిబ్బంది, సర్పంచ్ స్వప్న, నాయకులు ఉన్నారు.
తలమడుగు స్టేషన్ తనిఖీ
తలమడుగు, జనవరి 21 : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. రిసెప్షన్, లాకప్, పరిసరాలతో పాటు పలు రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ పురుషోత్తం, ఎస్ఐ ప్రవళిక ఉన్నారు.