భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఓటర్ల తుది జాబితాను గురువారం ప్రకటించింది. నవంబర్ 9, 2022 నుంచి డిసెంబర్ 8, 2022 వరకు సవరణ చేపట్టి వెల్లడించింది. ఇదే సమయంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని మాన్యువల్, ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా యువతీయువకుల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 21,04,401 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 10,64,526, పురుషులు 10,39,722, ఇతరులు 153 మంది ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధికంగా 2,48,982 మంది ఓటర్లు ఉండగా.. బెల్లంపల్లి నియోజకవర్గంలో అత్యల్పంగా 1,61,249 మంది ఉన్నారు. 2,810 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
– ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, జనవరి 5
ఆదిలాబాద్, జనవరి 5 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ సవరించిన ఓటర్ల జాబితాను గురువారం విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలున్నాయి. ఇందులో భాగంగా ఓటర్ల వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,04,401 మంది ఓటర్లున్నట్లు పేర్కొంది. ఇందులో మంచిర్యాల నియోజకవర్గంలో అధికం గా, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా ఓటర్లున్నట్లు తెలిపింది.