ఎదులాపురం, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంబిస్తున్న విధానానికి నిరసనగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి డప్పుకొడుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అలాల్ అజయ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపరాణి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
యాసంగి పంటను కొనుగోలు చేయాలి
నార్నూర్, డిసెంబర్ 20 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన తెలిపారు. కుమ్రం భీం విగ్రహానికి పూలమాలు వేసి గాంధీచౌరస్తా వరకు ఎడ్లబండితో ర్యాలీ తీశారు. చౌరస్తా వద్ద నరేంద్రమోదీ దిష్టబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, చంద్రశేఖర్, ఎంపీటీసీలు ఏత్మాబాయి, కళావతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
గాదిగూడలో…
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని గాదిగూడలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం జైవంత్రావ్, నాయకులు రాజేశ్వర్, భీంరావ్పటేల్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, డిసెంబర్ 20: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో టీఆర్ఎస్ నాయకులు కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, వైస్ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రషీద్, నాయకులు ప్రభాకర్, పోశన్న, రవి, రాజ్కుమార్, రాజేశ్, లక్ష్మణ్, భూమన్న పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 20: మావలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకుడు నల్లా రాజేశ్వర్, నాయకులు చందాల రాజన్న, గోవర్ధన్రెడ్డి, గంగుల కిరణ్, దొగ్గలి రాజేశ్వర్, మహేందర్ యాదవ్, సుధీర్ పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తే ఊరుకోం
బేల, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తే ఊరుకోమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు సిర్సన్న, మణియార్పూర్, చప్రాల, చాంద్పెల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశాల మేరకు నాయకులు చావుడప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామాల్లో రైతులు ర్యాలీ తీసి నిరసన తెలిపారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, గంభీర్ఠాక్రే, సతీశ్ పవార్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, జక్కుల మధుకర్, తన్వీర్ ఖాన్, సంతోష్బెదుడ్కర్, సింగిల్ విండో చైర్మన్లు, పార్టీ గ్రామ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్లో…
జైనథ్,డిసెంబర్ 20: మండలంలోని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు తీసి నిరసన తెలిపారు. మండగడ గ్రామంలో జడ్పీటీసీ అరుంధతి, ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకటరెడ్డి ,పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, రైతులు, నాయకులు పాల్గొన్నారు.