ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
కుభీర్, డిసెంబర్ 20 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. బాకోట లోని ఆంజనేయస్వామి ఆలయంలో వారం రోజు లుగా కొనసాగిన భాగవత సప్తాహం సోమవారం ఘనంగా ముగిసింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. మహారాష్ట్రలోని ఉస్మాన్నగర్కు చెందిన శ్రీచంద్రకాంత్ మహరాజ్ ఆలయంలో నిర్వహించిన కీర్తన ఆకట్టుకుంది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డికి వీణను బహూకరించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు రాందాస్ గురూజీ వాయిక ర్, ఆలయ కమిటీ చైర్మన్ పవార్ బాబారావు పటే ల్, వైస్ చైర్మన్ గణేశ్ చత్రే, మాజీ సర్పంచ్ దిగంబర్ పటేల్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, సింగిల్ విండో చైర్మన్ రేకుల గంగా చరణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మురళీ గౌడ్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారానికి కృషి
భైంసా, డిసెంబర్ 20 : సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. పంట నష్టం జరిగిందని రెండు రోజుల నుంచి భైంసా మండలానికి చెందిన ఆనంద్ బోతే చేపట్టి న నిరసన దీక్ష వద్దకు వెళ్లి మాట్లాడారు. త్వరలో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు మురళీగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, పండిత్ రావు, భోజరాం, తోట రాము, నాయకులు పాల్గొన్నారు.