జైపూర్, డిసెంబర్ 20: ఇందారం ఖని 1ఏ గనిపై ఈ నెల 16న మావోయిస్టుల పేరిట కరపత్రాలు అంటించిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ నరేందర్ వివరాలు వెల్లడించారు. ఇందారంఖని ఐకే 1ఏ గనిలో పంపు ఆపరేటర్గా పనిచేస్తున్న దండె మల్లేశ్కు డ్యూటీల విషయంలో తోటి కార్మికుడు రాధాకృష్ణతో గొడవ జరిగింది. దీంతో రాధాకృష్ణ మరికొంత మంది కార్మికులతో కలిసి మల్లేశ్ ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టారు. మల్లేశ్ది తప్పు అని తేల్చి కుటుంబసభ్యుల ముందు తిట్టి వెళ్లారు. అదే గనిలో పని చేస్తున్న రత్నాకర్రెడ్డి, గడ్డం మల్లయ్య యూనియన్ నాయకులు ఉన్నతాధికారులతో డ్యూటీల విషయంలో మల్లేశ్కు మెమోలు జారీ చేయించారు. దీంతో సదరు అధికారులు, కార్మికులపై కక్ష పెంచుకున్న మల్లేశ్ మరో కార్మికుడు బడికెల ఐలయ్యతో కలిసి ఈ నెల 15న రాత్రి మావోయిస్టు మంగీలాల్ పేరుతో అధికారులు, కార్మికులను హెచ్చరించే కరపత్రం తయారు చేయించాడు. దీనికి ముందు రిహర్సల్స్గా పలు పేపర్లలో రాసి చివరి పేపర్ను రెడ్ స్కెచ్పెన్తో రాసి 15న అర్ధరాత్రి క్యాంటిన్ వద్ద అంటించారు. ఈ విషయమై సంక్షేమాధికారి ఫి ర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మల్లేశ్ సామగ్రి డబ్బా వద్ద గమ్ బాటిల్, మూతను గుర్తించి పట్టుకున్నారు. కరపత్రాలు అంటించిన మల్లేశ్తో పాటు సహకరించిన ఐలయ్యను అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. మూడు రోజుల వ్యవధిలో గుర్తించిన శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, పీఎస్ఐ శ్రీకాం త్, సిబ్బంది జితేందర్, సుబ్బారావు, మల్లారెడ్డిను ఏసీపీ అభినందించారు.