రామగిరి, డిసెంబర్ 20: సింగరేణి సంస్థలో ఉ ద్యోగం రావడం వరంగా భావించాలని ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేర కు వివిధ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయిన ఏడుగురికి ఉద్యోగుల డిపెండెంట్లకు జీఎం కార్యాలయంలో కారుణ్య నియామక పత్రాలను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరందరికీ ఏఎల్పీ గనిలో పోస్టింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. క్రమశిక్షణతో పని చేయాలని, సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడా లని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌ తం శంకరయ్య, డీవైపీఎం రవీందర్ రెడ్డి, సీనియర్ పీవో నాగేశ్వరరావు, గిటుకు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
గోదావరిఖని, డిసెంబర్ 20: ఆర్జీ-1 పరిధిలో మెడికల్ ఇన్వాలిడేషన్, చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లు 38 మందికి ఆర్జీ-1 జీఎం నారాయణ నియామక పత్రాలను అందజేశారు. జీ ఎం కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో డిపెండెంట్లకు ఆర్జీ-1 ఏరియాలో పోస్టింగ్ ఇ స్తూ ఆర్డర్ కాపీలను అందజేసి అభినందించా రు. కార్యక్రమంలో జీఎం కమిటీ మెంబర్ పుట్ట రమేశ్, సీఎంవోఏఐ అధ్యక్షుడు పోనుగొటి శ్రీనివాస్, పర్సనల్ డీజీఎం లక్ష్మీనారాయణ, సీనియర్ పీవో సారంగపాణి, తిరుపతి, శ్రావణ్, మల్లీశ్వరి, తదితరులున్నారు.