ఇచ్చోడ, నవంబర్ 20: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల ఉద్యమ ఫలితమేనని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో శనివారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాసంగి ధాన్యం కొనగోలు విషయాన్ని కేంద్రం ప్రకటించిందంటే సీఎం కేసీఆర్, రైతుల విజయమని అన్నారు. కార్య క్రమంలో ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, నాయకులు మేరాజ్ అహ్మద్, ముస్తాఫా, దాసరి భాస్కర్, వెంకటేశ్, రాథోడ్ ప్రకాశ్, నర్వాడే రమేశ్, రాథోడ్ ప్రవీణ్, గాయ్కాంబ్లే గణేశ్, హరన్ రామేశ్వర్, సాబీర్, ఉప్పులేటి రాజేశ్వర్ పాల్గొన్నారు.
రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం
గుడిహత్నూర్, నవంబర్ 20 : రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని పార్టీ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ జిల్లా, మండల, అనుబంధ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రైతు ఉద్యమాలకు దిగివచ్చిన కేంద్రం
భీంపూర్, నవంబర్ 20 : రైతు ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం విధానాలతోనే రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాథోడ్ ఉత్తమ్, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు మడావి లింబాజీ, కృష్ణయాదవ్, అజయ్, చిన్ను, నాయకులు జీ నరేందర్యాదవ్, కపిల్యాదవ్, సంతోష్, జీ వైభవ్ యాదవ్, కల్చాప్యాదవ్, సంజీవ్రెడ్డి పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 20: ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ అశోక్, పీఏసీఎస్ వైస్చైర్మన్ ధనుంజయ్, నాయకులు గంగారాం, ఉత్తమ్, శ్రీనివాస్, విలాస్, బాపురెడ్డి, దాసు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.