ఎదులాపురం, నవంబర్ 20:అర్హులకు ఓటు హక్కు కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలపై కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 1జనవరి 2022 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయాలన్నారు.జిల్లాలోని 25 కళాశాలల యాజ మాన్యాలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని, ఓటరు నమోదుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బూత్ స్థాయి అధికారులకు అవగాహన కల్పించి, విద్యాలయాల సందర్శన, ఇంటింటి సర్వే కార్యక్రమాలు నిర్వహించి అర్హులను గుర్తించి నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 27,28 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెలాఖ రులోగా ఎలక్ట్రోరల్ పరిశీలకులు జి ల్లాను సందర్శించనున్నారని తెలిపా రు. గరుడ యాప్ను సమర్థవంతంగా వినియోగిస్తున్న బీఎల్వోను కలెక్టర్ అభినందించారు. ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, ఎలక్ట్రోరల్ మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.