తాంసి, అక్టోబర్ 20: జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట నిర్వహించిన ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం 81వ వర్ధంతిలో మాజీ ఎంపీ గొడం నగేశ్తో కలిసి భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన యోధుడు కుమ్రంభీం అన్నారు. మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ నిజాం సర్కార్ను ఎదురించి పోరాడిన యోధుడు కుమ్రం భీం అన్నారు. ఆదివాసుల స్వయం ప్రతిపత్తి కోసం నిజాం సైన్యాన్ని ఎదురించి పోరాడారని గుర్తు చేశారు. దండారి ఉత్సవాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం రూ. కోటి కేటాయించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సిడాం రాంకిషన్, కుర్సింగే తానాజీ, కృష్ణ, గణేశ్, నగేశ్, సంగెపు ఈశ్వర్, దేవన్న, రమణ పాల్గొన్నారు.
బడుగుల అభివృద్ధికి వాల్మీకి మహర్షి కృషి
తాంసి, అక్టోబర్ 20: బడుగుల అభివృద్ధికి వాల్మీకి మహర్షి ఎంతో కృషి చేశారని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ప్రస్తుతం 125 మంది శిక్షణ పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, బీసీ సంఘాల నాయకులు, బోయ కులస్తులు పాల్గొన్నారు.
పోరాటయోధుడు కుమ్రం భీం
ఉట్నూర్, అక్టోబర్ 20: జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాడిన యోధుడు కుమ్రంభీం అని రాష్ట్ర మంత్రి ఐకే రెడ్డి, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. బుధవారం కేబీ కాంప్లెక్స్లో కుమ్రంభీం 81వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ మాజీ చైర్మన్ కనక లక్కేరావు, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, మాజీ జడ్పీడీసీ వాగ్మారే జగ్జీవన్, మర్సకోల తిరుపతి, నాయకులు కందుకూరి రమేశ్, మెస్రం దుర్గు, శ్రీరాం నాయక్, మెస్రం మనోహర్, రాజేశ్, రాజ్కుమార్, సుమన్బాయి, కళావతి, కోల సత్యం, గిరిజన నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.