సింగరేణిలో అన్ఫిట్ చేయిస్తామని.., ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురికి టోకరా
రూ.1.60 కోట్లు వసూలు
వివరాలు వెల్లడించిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్
గర్మిళ్ల, అక్టోబర్ 20 : సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ చేయిస్తామని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.1,61,20,000 తీసుకుని మోసానికి పాల్పడిన ముగ్గురిని సీసీసీ నస్పూర్లో పోలీసు లు అరెస్టు చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన మారగోని శ్రీనివాస్గౌడ్ హోటల్ నిర్వహించేవాడు. ఈ క్రమంలో సింగేరేణి ఉద్యోగులతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత హోటల్ నడవక పోవడంతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఆటోతో వచ్చే డబ్బులు సరిపోక కు టుంబ పోషణ కష్టమైంది. దీంతో హైదరాబాద్కు మకాం మార్చాడు. అక్కడ రంగారెడ్డి జి ల్లా సరూర్నగర్కు చెందిన రవికాంత్ శర్మతో పరిచయమైంది. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని నమ్మిస్తే కార్మికులు అడిగిన న్ని డబ్బులు ఇస్తారని, అలా చేస్తే నీకు వాటా ఇస్తానని రవికాంత్ శర్మకు శ్రీనివాస్ గౌడ్ చెప్పడంతో అంగీకరించాడు.
దీంతో ఇద్దరు కలిసి కలిసి మేడ్చల్లోని ఐ సెక్యూరిటీ సర్వీసెస్ మేనేజర్ నక్క రాజా జ్ఞానసాగర్తో కలిసి మంచిర్యాల, మందమర్రి, సీసీసీ నస్పూర్, గోదావరిఖని, 8 ఇైంక్లెన్ కాలనీ ఏరియాలకు చెందిన సింగరేణి కార్మికులకు మాయమాటలు చెప్పి సింగరేణిలో అన్ఫిట్ చేయిస్తామని డబ్బులు తీసుకున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పేరిట హైదరాబాద్కు చెందిన పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ మేరకు మొత్తం 28మం ది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గు రు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై జితేందర్ పాల్గొన్నారు.