పాట్నా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్లో సిటి స్కాన్ ధరలను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. హై రిజల్యూషన్ సిటి (హెచ్ఆర్సిటి) స్కాన్ సింగిల్ స్లైస్ సిటి మెషిన్కు రూ. 2,500, మల్టీ స్లైస్ సిటి మెషిన్కు రూ.3,000గా నిర్ణయించింది. ఈ రేట్లకు మించి వసూలు చేసే ల్యాబ్స్పై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీహార్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5.6 లక్షలు, మరణాల సంఖ్య మూడు వేలు దాటాయి.