బెజ్జూర్, ఏప్రిల్ 11 : మండలంలోని ముంజంపల్లి లో ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వ ర్యంలో గురువారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి డుబ్బు ల జనార్దన్, ఆయన అనుచ రులు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మండలంలో పర్య టించిన నేపథ్యంలో ముంజంపల్లిలోని తన నివాసంలో జనార్దన్, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్సీ విఠల్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపుకోసం తమ వంతు కృషిచేస్తామని జనార్దన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు సామల రాజన్న, రాణా పాల్గొన్నారు.