రైతు బాగు కోసం తపించే వ్యక్తి
టీఆర్ఎస్లో పలువురి చేరిక సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 19: రైతులు బాగుండాలంటే దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన అశోక్ పంతులు తన సహచరులతో కలిసి ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దేశానికి మార్గదర్శనం చేసే పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాటం చేసి మూడు చట్టాలను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ అరుంధతి, నాయకు లు వెంకట్రెడ్డి, గోవర్ధన్, భోజారెడ్డి పాల్గొన్నారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం
పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు లింగారెడ్డి, జగదీశ్, రమణ, గంగయ్య, నారాయణ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి
ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన రెండు ప్రైవేట్ జిమ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో 12ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, జిమ్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
విజయ డెయిరీ అభివృద్ధికి కృషి
ఎదులాపురం, డిసెంబర్ 19 : రాష్ట్రంలో విజయ డెయిరీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ ఆవరణలో నూతన కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ముందుకు వచ్చి పాల ఉత్పత్తి పెంచడంలో సహకారం అందించాలన్నారు. అనంతరం రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతోనే జిల్లా కేంద్రంలో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విజయ డెయిరీ ప్లాంట్లలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడంతో సంవత్సరానికి రూ.20కోట్ల కరంట్ బిల్లు ఆదాయం మిగులుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్ కుమార్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, విజయ డెయిరీ డీడీ మధుసూదన్రావు, కౌన్సిలర్ అర్చన రాం కుమార్, సర్పంచ్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.