జిల్లాలో 29 కేంద్రాల ఏర్పాటు
రైతులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు
ఇప్పటి వరకు 7400 మెట్రిక్టన్నుల ధాన్యం సేకరణ
ఎప్పటికప్పుడు మిల్లులకు తరలింపు
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్/చింతలమానేపల్లి/పెంచికల్పేట్ డిసెంబర్ 19 : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో సుమారు 40000 మెట్రిక్ టన్నుల ధా న్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేశారు. దీనికి అనుగుణంగా పీఏసీఎస్ , డీఆర్డీఏ ఆధ్వర్యంలో 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాగ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు.
ధాన్యం బిల్లులకు ఓటీపీ
ధాన్యం విక్రయించిన రైతులకు బిల్లులు చేయాలంటే రైతు ఆధార్కార్డుకు మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరిగా అయి ఉం డాలి . ధాన్యం అమ్మిన తర్వాత బిల్లు చేసే సమయంలో రైతు భూమి వివరాలు పరిశీలించేందుకు ఆధార్ నమోదు చేయగానే సదరు రైతుకు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేస్తేనే రైతు వివరాలు ఓపెన్ అవుతాయి. అమ్మిన ధాన్యానికి సరిపడా పంట సాగు ఉందా లేదా పరిశీలించి , బిల్లుల రికార్డు చేస్తారు. దీని వలన స్థానిక రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది . కేంద్రాల్లో తూకంలో తేడా , హమాలీ , ధాన్యం తరలింపు పేరుతో అధిక వసూళ్లు వంటి ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు మండలాల వారీగా ప్రత్యేక కమిటీలను నియమించారు. మండల వ్యవసాయ అధికారి , పీఏసీఎస్ చైర్మన్ , ఎన్ఫోర్స్మెంట్ డీటీ, ఐకేపీ, ఏపీఎం, రైతుబంధు సమితి చైర్మన్ కమిటీలో ఉంటారు.
కొనుగోలు కేంద్రాల వివరాలు..
జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ , దహెగాం మండలంలో కల్వాడ , దహెగాం , కొంచవెల్లి , లగ్గాం , గిరివెల్లి , ఒడ్డుగూడ , చంద్రపల్లి , సిర్పూర్ (టీ) మండలంలోని సిర్పూర్ (టీ) , లోనవెల్లి, దుబ్బగూడ , రెబ్బెన మండలంలో నారాయణపూర్, ఎడవెల్లి, రెబ్బెన , బెజ్జూర్ మండలంలో బెజ్జూర్, ఎల్లుర్ , పెంచికలపేట్ మండలంలో గుండ్లపేట్ , కొండపల్లి , ఎల్కపల్లి , కౌటాల మం డలంలో కౌటాల , వీర్వెల్ల్లి, కుంబారి సాండ్గాం , కాగజ్నగర్ మండలంలో ఆరెగూడ, సీతానగర్, కాగజ్నగర్ , తిర్యాణి మండలకేంద్రం, చింతలమానేపల్లిలో రవీంద్రనగర్ , చింతలమానేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.