ఇచ్చోడ: మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఇచ్చోడ, డిసెంబర్ 19: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల కేంద్రంలోని టీచర్స్కాలనీలో నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఆదివారం గోపాలకృష్ణ మందిరం పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా వైభవంగా హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజారోహణ స్తంభాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ ప్రధాన రహదారికి రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వైష్ణవి సదాన్ సంస్థాన్ పీఠాధిపతి శ్రీశ్రీ నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంకీర్తనలు, భజన మండలి భక్తులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులు ఫకీర్దాస్, బాబుసింగ్, ఆత్రం భాస్కర్, అరుణ్, సుదర్శన్, బాలాజీ, పరమేశ్వర్, వివిధ పార్టీల నాయకులు జాదవ్ అనిల్, ఏనుగు కృష్ణారెడ్డి, కదం బాబారావ్, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తాంసి, డిసెంబర్ 19: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తాంసి మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన హైలాపురం లక్ష్మికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.9500 చెక్కును అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ముఖ్యమం త్రి సహాయనిధి అండగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.