డిసెంబర్ 31 వరకు దరఖాస్తు గడువు
ఏడాది పాటు ఉచిత బీమా..
126 రంగాల్లో పని చేసే కార్మికులు అర్హులు
భైంసా, డిసెంబర్ 19ప;ఏడాది పాటు ఉచిత బీమా..ఈ- శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసు కున్న కార్మికులకు మొదటి ఏడాది ఉచిత బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కొనసాగించేలా రూపొందించారు. ప్రతి సంవత్సరం రూ. 12 ప్రీమియంగా కార్మికులు చెల్లించాల్సి ఉంటుంది.
నమోదుకు నిబంధనలు ఇలా..
వివిధ రంగాల్లో పనిచేస్తున్న 16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ-శ్రమ్ కార్డుకు అర్హులు. వడ్రంగి, కమ్మరి, శిల్పి, ఇటుక బట్టీలు, క్వారీల్లో పనిచేసే వారు.. భవన నిర్మాణ కార్మికులు, పాలు పోసే వారు, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, బీడీ కార్మికులు, కూరగా యలు, పండ్లు అమ్మే వారు. ఉపాధి హామీ, వ్యవ సాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు, విలేక ర్లు, ఇండ్లల్లో పనిచేసే వారు, నాయీబ్రహ్మణు లు, ఆటో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, సున్నం బట్టీలు, టేలరింగ్తోపాటు ఈ -శ్రమ్ కార్డు పరిధి లో 126 రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను అర్హు లుగా గుర్తిస్తారు. ఈ- శ్రమ్ పోర్టల్లో పేర్ల నమో దుకు డిసెంబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నమోదు ప్రక్రియ ఇలా..
కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా, ఇంటర్నెట్ సెంటర్లలో ఈ-శ్రమ్ కోసం నమోదు చేసుకో వాలి. ఈ- శ్రమ్ పోర్టల్లో ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నంబర్ల వివరాలను నమోదు చేయాలి. దీంతో ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే దరఖాస్తు పరిశీలన పూర్తవుతుంది. ఆ తర్వాత వెబ్సైట్లో ఈ-శ్రమ్ గుర్తింపు కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.