భైంసాటౌన్, డిసెంబర్ 19 : పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఉంటుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. కుంటాల గ్రామానికి చెందిన కే సాయినాథ్కు రూ.40 వేలు, దొనికెన రెడ్డికి రూ.12 వేలు, జే రేవతికి రూ.13 వేలు, ఎస్ వెంకటేశ్కు రూ. 12 వేలు, ఎస్ గంగాధర్కు రూ. 14 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరయ్యాయి. ఆదివారం దేగాం గ్రామంలోని తన స్వగృహంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కుంటాల టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తాత్రి, జక్కుల ముత్యం, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
కుభీర్లో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘం సభ్యులు దేగాం గ్రామంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి గంగాధర్, పీరాజీ, సభ్యులు పాల్గొన్నారు.
జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
ముథోల్, డిసెంబర్, 19 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మైదానంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్- 19 క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టోర్నమెంట్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికే భైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియంలో క్రీడలకు అవసరమైన సామగ్రిని త్వరలోనే సమకూర్చడానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 24వ తేదీ వరకు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, ప్రముఖ వైద్యుడు దామోదర్ రెడ్డి, ఎన్ఆర్ఐ బాజీరావ్, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, సీఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సాయికిరణ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంతోష్, సోషల్ మీడియా ఇన్చార్జి సంజు ముత్యపువార్, నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.