బోథ్ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ తుల శ్రీనివాస్
బోథ్, డిసెంబర్ 19: గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా సహకారం అందించాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన
ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 గ్రామ పంచాయతీల్లో మొదటి విడుత టీకా వందశాతం పూర్తయిందన్నారు. రెండో విడుత టీకా వేసే కార్యక్రమం నడుస్తున్నందున గ్రామాల్లో మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ వేయించే బాధ్యత సర్పంచ్లు, ఎంపీటీసీలు తీసుకోవాలన్నారు. విద్యుత్, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, విద్య, ఉపాధి హామీ, ఐకేపీ, పంచాయతీ రాజ్, ఆరోగ్యం, గ్రామీణ నీటి సరఫరా విభాగాల్లో ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. మండల వ్యాప్తంగా 12,566 మంది రైతులకు రూ.21.16 కోట్ల రైతుబంధు సాయం అందుతుందని ఏవో వివేక్ తెలిపారు. యాసంగిలో రైతులకు నువ్వులు, వేరుశనగ విత్తనాలు సరఫరా చేయించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశంలో వైస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ, జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఎంపీడీవో రాధ, ఎంపీవో జీవన్రెడ్డి, ఎంఈవో భూమారెడ్డి, సీడీపీవో సౌందర్య, ఏపీవో శ్యాం, ఏపీఎం మాధవ్, ఏఈఈలు నర్సింగ్, కళ్యాణ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
బోథ్లో డివిజనల్ స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
బోథ్లో డివిజనల్ స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని బచావో సమితి సభ్యులు ఎంపీపీ తుల శ్రీనివాస్కు విన్నవించారు. జడ్పీ సమావేశంలో వీటి ప్రస్తావన తీసుకువస్తానని ఎంపీపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ పసుల చంటి, కో కన్వీనర్లు షేక్ షాకీర్, రవి, సుమేర్ పాషా, దాసు, తదితరులు పాల్గొన్నారు.