నేరడిగొండ, సెప్టెంబర్ 19: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేరడిగొండలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్గా అల్లూరి శివారెడ్డి కమిటీ సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పక్షాలు రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి పక్షాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, నేరడిగొండ సర్పంచ్ వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, నాయకులు సయ్యద్ జహీర్, గడ్డం భీంరెడ్డి, వైస్ఎంపీపీ మహేందర్రెడ్డి, చంద్రశేఖర్యాదవ్, ఆడెపు రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా
బోథ్, సెప్టెంబర్ 19: కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని కుమ్మరి సంఘం నాయకులు ఆదివారం ఆదిలాబాద్లో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కుల సంఘాలను గుర్తిస్తూ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. కులవృత్తులను కాపాడుకునేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుందని తెలిపారు. పొచ్చెరలో సంఘ భవనానికి రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కన్నం మోహన్బాబు, కోశాధికారి శంకర్, బోథ్ మండలాధ్యక్షుడు ఆశన్న, గ్రామ సంఘం బాధ్యులు పాల్గొన్నారు.