బెజ్జూర్, జనవరి 19 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని సిర్పూ ర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని మర్తిడి గ్రామంలో బుధవారం సమక్షంలో కుకుడ, బెజ్జూర్, మర్తిడి తదితర గ్రామాలకు చెందిన 100 మంది ఇతర పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంద్రం పుష్పలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిడాం సకారాం, సింగిల్ మాజీ విండో చైర్మన్ డోకె వెంకన్న, కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, సర్పంచ్లు పొర్తెటి రవి, కుమ్రం హన్మంతు, రేణుకుంట్ల సంతోష్, తలండి తిరుపతి, బుజాడి శేఖర్, నాయకులు కుర్సింగ ఓంప్రకాశ్, బోర్కుట్ తులసీరాం, చిప్పకుర్తి దేవాజీ, సడ్మెక పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.