బేల, డిసెంబర్ 18 : దైవ నామస్మరణతో ముక్తి మార్గాన్ని పొందవచ్చని, బాజీరావు చూపిన మార్గంలో నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మణియార్పూర్ గ్రామంలో సప్తాహ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబా పల్లకీకి పూజలు చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు. మణియార్ గ్రామంలో భజన సంకీర్తనలతో నృత్యాలు చేస్తూ భక్తులు సందడి చేశారు. అనంతరం ఆలయం వద్ద కాల దహిఅండ నిర్వహించారు. బాబా భక్తులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం మహా అన్నదానం చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బేల, జైనథ్ ఎంపీపీలు వనిత ఠాక్రె, గోవర్ధన్, నాయకులు గంభీర్ ఠాక్రె, ప్రమోద్ రెడ్డి, వాడ్కర్ తేజ్రావ్, సతీశ్ పవార్, విపిన్, మధుకర్, సంజయ్, బండారి దేవన్న, బాబా భక్తులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికమార్గంలో నడవాలి
జైనథ్, డిసెంబర్ 18 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని బాలాపూర్లో నిర్వహించిన దత్తజయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలో అన్నదానం నిర్వహించారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్ఢి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, సర్పంచ్ జక్కుల వినోద్ యాదవ్ పాల్గొన్నారు.