కుంటాల, డిసెంబర్18 : కుంటాల మండ లంలోని సమస్యల పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలం ఓల గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. ఓల అనుబంధ గ్రామం రాజాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యేకు సమస్యలను విన్నవించారు. కాళేశ్వరం 27వ ప్యాకేజీ కాలువల నిర్మాణ పనులు భూముల కోల్పోయిన రైతులకు రైతు బంధు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై మొండి వైఖరి అవలంబిస్తున్నదని, ఫలితంగా వరి పండిం చే రైతులకు శాపంగా మారిందని తెలిపారు. కుంటాల మండలాన్ని నియోజకవర్గంలోనే ఆద ర్శంగా తీర్చిదిద్దేందుకు దశలవారీగా కృషి చేస్తానన్నారు. అనంతరం ఓల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఎగ్గాం గణేశ్ కుమారుడి వివాహ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట సర్పంచ్ ఖనీష్ ఫాతిమా, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, టీఆర్ఎస్ నాయకులు సబ్బిడి గజేందర్, రాకేశ్, తాటి మహేశ్, ప్యాదరి భూమన్న, లక్ష్మణ్ ఉన్నారు.