రామకృష్ణాపూర్, అక్టోబర్ 18 : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ 38వ జన్మదిన వేడుకలను సోమవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక పాత్రను పోషించిన బాల్క సుమన్ తెగువ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. పెద్దపల్లి ఎంపీగా, చెన్నూర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రామకృష్ణాపూర్, మందమర్రి, చెన్నూరులో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి మార్చిలో గృహ ప్రవేశం చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలోని 22 వార్డులలో వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాల్క సుమన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ యాకూబ్అలీ, పోగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్, జిలకర మహేశ్, అలుగుల శ్రీలత, నాయకులు రామిడి కుమార్, బైరమల్ల మొగిలయ్య, శివకిరణ్, జే. కుమార్, నక్క శ్రీనివాస్, ఎల్లబెల్లి మూర్తి, కొక్కుల సతీశ్, కొండ కుమార్, నరెడ్ల కల్పన, సౌందర్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెమొంటో అందజేత
రామకృష్ణాపూర్, అక్టోబర్18: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను టీఆర్ఎస్ నాయకులు కమలాపూర్లో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, అనిల్రావు, రేవెల్లి ఓదెలు, సీనియర్ నాయకుడు నీలం శ్రీనివాస్గౌడ్, యువత నాయకులు పాల్గొన్నారు.
చిత్రపటం బహూకరణ..
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 18 : ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్కు పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ మైనపు చిత్రపటాన్ని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు రాజనాల రమేశ్ అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ చర్చల ప్రతినిధి ఏగుగు రవీందర్రెడ్డి, నాయకులు వీరభద్ర, బ్రహ్మచారి, జగన్ తదితరులున్నారు.
మందమర్రి పట్టణంలో..
మందమర్రి అక్టోబర్ 18: మందమర్రి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ(బీ 1) కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ విప్ నల్లాల ఓదెలు కేక్కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అంతకు ముం దు పాలచెట్టు ఏరియాలోని శ్రీపంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నాయకులు, కార్యకర్తలు కేకులను కట్చేసి వేడుకలు నిర్వహించారు. స్థానిక మార్కెట్లో టీఆర్ఎస్ నాయకులు బండారి రవికుమార్ కార్యకర్తలతో కలిసి అన్నదానం చేశారు. మందమర్రి సీఐ ప్రమోద్రావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక 7వ వార్డులో టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు తోకల నిరోష కేక్కట్ చేసి, మాస్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే.రవీందర్, కొంగల తిరుపతిరెడ్డి, ఎండీ అబ్బాస్, ఈశ్వర్, బత్తుల శ్రీనివాస్, భూపెల్లి కనకయ్య, తోట సురేందర్, భట్టు రాజ్కుమార్, మేడిపల్లి మల్లేశ్, ఎండీ ముజాహిద్, మాసు వెంకటేశ్, మహిళా నాయకురాళ్ళు అన్నమల్ల సుజాత, తోకల నిరోష, బత్తుల సరిత, తిరుపతక్క, సుగుణ, శారద, ఎర్ర రజిత, స్వరూప, మంజుల, రేఖ తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రకృతి వనంలో వేడుకలు
చెన్నూర్ రూరల్, అక్టోబర్18 : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పుట్టిన రోజు వేడుకలను కిష్టంపేటలోని పల్లె ప్రకృతివనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లెల దామోదర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, ఉప సర్పంచ్ ముకుందరెడ్డి, ఎంపీటీసీ పద్మ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.