ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
60 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : కరో నా లాంటి విపత్కర పరిస్థితిలోనూ పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్ రూరల్, మావల మండలాలకు చెందిన సుమారు 60 మంది లబ్ధిదారులకు రూ.40.60 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సన్నగిల్లినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా చేస్తున్నారన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభు త్వం నిరంతరం పనిచేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి పాలన నేర్చుకోవాలని సూచించారు. కరోనాతో దేశమంతా అల్లాడుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ ఎన్నిక ల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో బహిరంగ సమావేశాలు పెట్టడంతోనే వైరస్ వ్యాప్తికి కారణమైందన్నా రు. కరోనా నియంత్రణలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలమీదికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పంచులు భూమన్న, భాస్కర్, నాయకులు సెవ్వ జగదీశ్, నల్లా రాజేశ్వర్, కనక రమణ, రాగం గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.