నార్నూర్, జనవరి 18 : పుష్యమాసం పురస్కరించుకొని ఖాందేవ్ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. సోమవారం అర్ధరాత్రి తొడసం వంశీయులు ఖాందేవుడికి సంప్రదాయ పూజలు చేసి, జాతరను ప్రారంభించారు. మంగళవారం ఆ వంశ ఆడబిడ్డతో నూనె తాగించే మహోన్నత కార్యక్రమం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి తొడసం వంశీయులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ముందుగా ఆ వంశస్తులు కుటుంబసమేతంగా 2 కిలోల తైలం సేకరించారు. దైవమూర్తులకు నైవేద్యంగా సమర్పించిన మడావి ఏత్మాబాయి నూనెను తాగారు. ఆమెను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆసిఫాబాద్ ఎ మ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి తొడసం వంశీయులు డోలువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం దర్బార్ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఆసిఫాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, కటోడా లు తొడసం బాపురావ్, తొడసం ఆనంద్రావ్, తొడసం పెద్దలు తెలంగ్రావ్, రాజు, యాదవ్రా వ్, గోపాల్, గజేందర్, బండు, చిత్రు, రామారా వ్, మడావి జైవంత్రావ్, సార్మెడి మడావి తు కారాం, నారింజపటేల్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ పరమేశ్వర్, ఆలయ కమిటీ చైర్మన్ మె స్రం రూప్దేవ్, కమిటీ అధ్యక్షుడు తొడసం నాగోరావ్, రాయిసెంటర్ జిల్లా సార్మెడి దుర్గుపటేల్, మెస్రం శేఖర్బాబు, కనన ప్రభాకర్ పాల్గొన్నారు.
మూడేళ్లుగా.. తైలం తాగిన ఆడబిడ్డ
యేటా జాతర ప్రారంభమైన మరుసటి రోజున తొడసం వంశ ఆడబిడ్డతో తైలం తాగించడం ఆచారం. తొడసం జంగుబాయి-సోనేరావ్ దంపతుల కూతురు మడావి ఏత్మాబాయి విశ్వశాంతిని కోరుతూ మూడేళ్ల నుంచి నూనె తాగుతున్నది. మూడేళ్ల తర్వాత మరొకరికి అవకాశం కల్పిస్తారు. ఈ యేడాదితో మూడేళ్లు పూర్తవుతున్నదని ఆ వంశం పెద్దలు తెలిపారు.