జిల్లా ఏర్పాటుతోనే దినదినాభివృద్ధి
రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, జనవరి 18 : రూ.40 కోట్లతో పట్టణంలోని ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నాయుడివాడ చౌరస్తా నుంచి బంగల్పేట్ వరకు కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పను లు జరుగుతున్న ప్రాంతం నుంచి చివరి వరకు కాలినడకన తి రుగుతూ కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బంగల్పేట్ వరకు రోడ్డు వెడల్పు పనులు గాంధీచౌక్ వరకు పూర్తయ్యాయని తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణానికి టెం డర్లను ఆహ్వానించామన్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటుతోనే దినదినాభివృద్ధి చెందుతున్నదని స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణ ప నుల్లో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైన్గేట్ ప్రాంతంలో బాలాజీ బాంక్వెట్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని యజమాని రవీందర్ రెడ్డి సన్మానించారు. మంత్రి వెంట నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎం పీపీ రామేశ్వర్, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, కౌన్సిలర్లు ఎడిపెల్లి నరేందర్, పూదరి రాజేశ్వర్, బిట్లింగ్ నవీన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు మేడా రం ప్రదీప్, పద్మాకర్, ముడుసు సత్యనారాయణ ఉన్నారు.
భూసార పరీక్షా కేంద్రం ప్రారంభం..
నిర్మల్ టౌన్, జనవరి 18 : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై దుయ్యబట్టారు. రైతు దేశానికి వెన్నెముక అని చెబుతూనే వారి నడ్డి విరిచేలా వ్యవసాయ విధానాలు అమలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఏడేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ సర్కారు రైతులకు చేయూతనిస్తూ ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అమలుచేస్తున్నదని స్పష్టం చేశారు. ఐదు రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పాటించాలని సూచించారు. భూసార పరీక్షలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
డీలర్లకు సర్టిఫికెట్లు..
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఉత్తీర్ణులైన విత్తన, ఎరువుల డీలర్లకు మంత్రి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. జిల్లాలో మొదటి, రెండో విడుత కింద 80 మందికి శిక్షణ ఇవ్వగా.. రైతులకు ప్రయోజనం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రఘనందన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పుప్పాల కృష్ణ, శంకర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కృష్ణప్రసాద్రెడ్డి, రమణారెడ్డి, మాణిక్రెడ్డి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, ఓస రాజేశ్వర్, రామయ్య, రైతుబంధు సమితి కన్వీనర్లు ధర్మాజి శ్రీనివాస్, నర్సారెడ్డి, ముత్యంరెడ్డి, నిర్మల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, వ్యవసాయశాఖ అధికారులు కోటేశ్వర్రావు, వినయ్బాబు, వీణారెడ్డి, స్రవంతి, నాగారాజు, ప్రవీణ్కుమార్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు మల్లికార్జున్రెడ్డి, మాధవరావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీసీసీబీ డైరెక్టర్ గంగాచరణ్, టీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, మహేందర్రెడ్డి, గంగారాం, ముత్యంరెడ్డి, రాజారెడ్డి, సాయారెడ్డి, మార్కెటింగ్శాఖ అధికారులు అశ్వక్అహ్మద్, ప్రశాంత్, భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.